బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు తొందర్లోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. జెన్ కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వేలం ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని బాలినేని తెలిపారు.బొగ్గు కొరత కారణంగా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ ప్లాంట్ లో వార్షిక మరమ్మతులు చేపట్టామని వివరించారు. బొగ్గు కొరత వల్ల ఎలాగూ థర్మల్ యూనిట్లను మూసివేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదని, అక్కడున్న బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వడంలేదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. “మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నా” అంటూ ట్విట్టర్ లో స్పందించారు.