ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలు పున: ప్రారంభం కానున్నాయి. సీఎం జగన్ నిర్ణయంతో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. మొదటి విడత నాడు-నేడు పనులు అదే రోజు ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు సర్కార్ వివరించనుంది. ఇక విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అదే రోజు విద్యాశాఖ అందజేయనుంది.