తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ యాంకర్ శ్యామల సుదీర్ఘ కాలంగా కెరీర్ లో కొనసాగుతూనే ఉంది. బుల్లి తెరపైనే కాకుండా అప్పుడప్పుడు ఈమె పొలిటికల్ తెరపై కూడా కనిపిస్తూ వస్తుంది. వైఎస్ జగన్ కు మరియు షర్మిలకు సన్నిహితంగా ఉంటూ రాజకీయాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో భర్తతో ఎక్కువగా బయట కనిపించడం లేదు. దాంతో మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
యాంకర్ శ్యామల తన భర్తకు విడాకులు ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించింది. నేను నా భర్త విడాకులు తీసుకున్నాం అని చాలా సార్లు వార్తలు వచ్చాయి. కాని మేము ఒక్క సారి కూడా విడాకులు తీసుకోలేదు అంది. నా భర్త చాలా రిజర్వ్ గా ఉంటాడు. ఆయన బయట కనిపించడం ఇష్టం ఉండదు. అందుకే ఆయన నా పక్కన ఎక్కువగా కనిపించరు. అంత మాత్రానికే మేము విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు రాస్తారా అంటూ శ్యామల ప్రశ్నించింది.