కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. యాంకర్ అనసూయ ఇందులో ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. తాజాగా కార్తికేయ – అనసూయలపై చిత్రీకరించిన ఆ పాట ప్రోమో సాంగ్ని చిత్రబృందం విడుదల చేసింది.
‘‘పైన పటారం.. ఈడ లోన లొటారం ..విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’’అంటూ సాగే వీడియో సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వీడియో సాంగ్ని మార్చి 1, సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్బిజోయ్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.