టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చని కొంతమందికి చాలా క్లియర్ గా అర్థమైనట్లు ఉంది. ముఖ్యంగా KGF దర్శకుడు తన భవిష్యత్తు సినిమాలను ఎక్కువగా మన తెలుగు హీరోలతోనే చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే ఇద్దరి హీరోలను లాక్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరో స్టార్ హీరోతో కూడా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF. చాప్టర్ 1తో కన్నడ సినిమా స్థాయిని నేషనల్ వైడ్ కు తీసుకు వచ్చాడు. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ప్రశాంత్ చేసిన యాక్షన్ మ్యాజిక్ ఆడియెన్స్ బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక KGF చాప్టర్ 2 అంతకుమించి అనేలా ఉంటుందని టాక్ అయితే వస్తోంది. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ప్రశాంత్ భవిష్యత్తు కథలకు హీరోలను సెలెక్ట్.
#PrashanthNeel #AlluArjun Combo loading 🔥 🔥 🔥 @alluarjun #AA22 #Salaar #KGFChapter2
Prashanth Neel sir came to Geeta Arts to meet #Stylishstar #AlluArjun #AlluArjunForCKCEvent
Guys get ready for big Combos of Allu Arjun soon pic.twitter.com/tUYtCTdEo4— Tollywood Updates (@Vali26783514) March 9, 2021
ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక షెడ్యూల్ షూటింగ్ ను ను కూడా పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కు ఇస్తున్నారు. సినిమాను వచ్చే ఎడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది.
అయితే ఇంకా రెండు సినిమాలను రిలీజ్ చేయాల్సిన బాధ్యతను మోస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి టెన్షన్ లేకుండా భవిష్యత్తు కథలను కూడా హ్యాపీగా రెడీ చేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక స్టోరీ లైన్ అయితే అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆ కాంబోని సెట్స్ పైకి తీసుకు రావాలని చూస్తోంది.
ఇక చాలా కాలం తరువాత ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ ఇద్దరు కూడా గంటల తరబడి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పుష్ప అనంతరం బన్నీ మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రశాంత్ నీల్, బన్నీకి స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే!