స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా… తమిళ, మలయాళ భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పోతే అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మికమందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యూఏఈ కి వెళ్లిన అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది. ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతనమైన బహుమానాన్ని ఇచ్చాడు.
కేరళ మూలాలు ఉండి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ యూఏఈలో అల్లు అర్జున్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.