నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమా తెలుగులో రీమేక్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటిస్తుండగా.. బీజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లు, పవన్ సరసన సాయి పల్లవి కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయి పల్లవి తప్పుకుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. కాగా ఇక తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఐశ్వర్య రాజేష్ కూడా తప్పుకుందని తెలుస్తోంది. ఈ మార్చిలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే అటు సాయి పల్లవి, ఇటు ఐశ్వర్యా రాజేష్లు ఇద్దరూ మార్చి బిజీగా ఉండడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. దీంతో ఈ టాలెంటెడ్ నటీమణులు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేందేం లేక చిత్రబృందం మరో ఇద్దరిని వెతికే పనిలో ఉందట.
ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాలీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి.