బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్(58) మృతిచెంచారు. గుండెపోటుతో మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ కపూర్ ఫోటో షేర్చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కాగా దివంగత నటుడు రాజ్ కపూర్కు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్. రాజ్ కపూర్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అన్న విషయం తెలిసిందే. రాజీవ్ కపూర్ ‘రామ్ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది.