హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అసలు మాట్లాడుకోలేదని, ఎడమొహం పెడమొహంగా ఉన్నారనీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఇప్పటికే విష్ణు స్పష్టత నిచ్చారు. ఈ రోజు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అలాయ్ బలాయ్ కార్యక్రమంలో విష్ణును పవన్ కల్యాణ్ గుండెలకు హత్తుకున్నారు. అనంతరం వారిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. వీరితో పాటు దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కూడా మాట కలిపారు
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021