టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ షోలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ అందరినీ హుషారెత్తిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, స్టార్ డైరెక్టర్లు రాజమౌళి-కొరటాల శివ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. మహేశ్ బాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. తాజాగా మరో టాప్ టాలీవుడ్ సెలబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం రాబోయేది స్టార్ హీరో కాదు..స్టార్ హీరోయిన్.
కొన్నాళ్లుగా మీడియా, సోషల్మీడియాతోపాటు అందరి నోళ్లలో నానుతున్న పేరు. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చెన్నై సోయగం సమంత. ఫిలింనగర్ సర్కిల్ సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొంటుందట. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల చివరలో కానీ..వచ్చే నెల ప్రారంభంలో కాని ప్రసారం కానుందని టాక్. దసరా సందర్భంగా మహేశ్ బాబు, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే స్పెషల్ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు మేకర్స్. విడాకుల అంశంతో కొన్నాళ్లుగా టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్న సామ్ ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రత్యేక ఎపిసోడ్ లో ఎలా మెరుస్తుందో చూడాలి మరి.