పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఓ చిన్న క్లిప్ వదిలారు నిర్మాతలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ గింప్స్ విడుదల చేశారు. అయితే ఇలా విడుదల చేశారో లేదో అప్పుడే ఈ క్లిప్ పై విమర్శలు మొదలయ్యాయి. మల్టీస్టారర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి ఒక్కరి వీడియోను మాత్రమే విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీ సోలో హీరో మూవీగా మారిందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రానా వాయిస్ మాత్రం వినిపించారు. ‘డ్యాని.. డ్యానియల్ శేఖర్’ అని ఇందులో రానా అంటాడు. రానాను ఈ వీడియోలో చూపకపోవడంతో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందులో పవన్ కల్యాణ్ ను చూపించి, రానాను మాత్రం చూపించకపోడం పట్ల నిర్మాత నాగ వంశీ రిప్లై ఇచ్చారు. దయచేసి వెయిట్ చేయాలని, దీనిపై ఎలాంటి ఊహాగానాలూ వద్దని చెప్పారు. ప్రతీది క్రమ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. కాగా, ఈ సినిమాలో నిత్యామేనన్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
A multi-starrer has turned into a solo hero movie? #BheemlaNayak
— Jalapathy Gudelli (@JalapathyG) August 15, 2021
Power Storm in Full Swing. Blasting First Glimpse 🔥
All the best to entire team of #BheemlaNayak 💫https://t.co/gyJhea3akE @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts
— Mega Surya Production (@MegaSuryaProd) August 15, 2021