రైతుల పట్ల ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరును జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దళారులను మించిపోయి రైతులను రోడ్డుమీదకు తెస్తుందని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలు, బకాయిల విషయంలో గోప్యత ఎందుకని, ధాన్యం డబ్బులు రాకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించిన జనసేనాని ఈ నెలాఖరులోగా రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని జగన్ ప్రభుత్వాన్నిహెచ్చరించారు పవన్.