హీరో మంచు మనోజ్ తన సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. కొవిడ్-19 కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలని ఆయన కోరారు.
‘కొవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేసేందుకు పుట్టినరోజు నాడు నా వంతు సాయం చేయనున్నాను. ఈ మేరకు నా అభిమానులు, మిత్రులతో కలిసి 25వేల కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులను అందిస్తున్నాం. ఇలాగే మరెన్నో సహాయ కార్యక్రమాలతో ముందుకు సాగాలని భావిస్తున్నాను. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని కోరుతున్నాను. అత్యవసరమైతేనే బయటకు రండి. ఇంటికే పరిమితమై ఇంటిల్లిపాదిని సురక్షితంగా చూసుకోండి’ అని మనోజ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిదే. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ విభిన్నమైన లుక్లో కనిపించనున్నారు. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇది విడుదల కానుంది.