తన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్రాజ్ ప్రకటించారు. ‘మా’ ఎన్నికల అనంతరం ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ.. సమాస అసోసియేషన్ లో మంచు విష్ణు పనులకు అడ్డు రాకూడదనే తాను రాజీనామా చేశానని ఈ సందర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మంచు విష్ణు టీంకు ప్రకాశ్రాజ్ సూచించారు. విష్ణు రెండేళ్లు బాగా పనిచేయాలని సూచించారు.
‘మా’ మంచి కోసం తామంతా ముందుకొచ్చామని ప్రకాశ్రాజ్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో రౌడీయిజం బాగా పెరిగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ల నుంచే అది మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో మనుషుల్ని తీసుకొచ్చారు. బెనర్జీపై చేయి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. గెలిచిన వాళ్లను ఓడిపోయారని మరుసటి రోజు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు, మేము కలిసి పనిచేయగలమా..? అని ప్రశ్నించారు. గతంలో సగం, సగం ప్యానెల్తో కలిసి పనిచేయలేకపోయారు. మా సంక్షేమం కోసమే రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకాశ్రాజ్ చెప్పారు.
విష్ణు నా రాజీనామాను స్వీకరించనని అన్నారు.. ఒప్పుకుంటా తెలుగు వాళ్లు కాకపోయినా బైలాస్ మార్చననే షరతుకు ఒకే అయితే ‘మా’ సభ్యత్వానికి నా రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకాశ్రాజ్ చెప్పారు. ఓటేసేందుకు, ఒకరిని సభ్యుడిగా గెలిపించేందుకు నేను సభ్యుడిగా ఉండనని ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు. ఇది ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. మీరు పనిచేయాలని మేం బయట నుంచి చూస్తామని, విష్ణు మా రాజీనామాలను ఒప్పుకుంటారని ఆశిస్తున్నానన్నారు.