తాజాగా ఆయన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా రష్మిక అలరించనుంది. తాజాగా ‘విజయ దశమి’ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. పండుగ నేపథ్యానికి తగినట్టుగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. రాధిక .. ఉర్వశి .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.