పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో ప్రకటించిన సినిమాలను వరుసగా పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఆయన సలార్ షూటింగ్లో పాల్గోంటుండగా.. ఈరోజు ప్రభాస్ ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. దీనికి సంబంధించి ప్రభాస్ తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇక ఇప్పటికే.. ఈ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ మొదలైందని గతంలో ప్రకటించాడు. ఆదిపురుష్ను బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా నటిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని సమాచారం. దీనికి కొంత క్లారిటీ రావాల్సిఉంది. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రంలో ఆ రోల్కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపించగా తాజాగా టైగర్ ష్రాఫ్ పేరు వినపడుతోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర పోషించనుండగా, ఆయన తల్లి కౌశల్య పాత్రలో హేమమాలిని కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆ రోల్కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపిస్తుంది. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్కు తమ్ముడిగా కనిపించనున్నాడని మొన్నటి వరకు టాక్ రాగా.. తాజాగా టైగర్ ష్రాఫ్ నటించనున్నాడని అంటున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం పేర్కోంది. ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు. వీటితో పాటు ప్రభాస్ కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది.