అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం కొందరు సెలబ్రిటీలు సైతం పవన్ సినిమా చూస్తూ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా ఎంజాయ్ చేయడం. అందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. హైదరాబాద్లో వేసిన ‘వకీల్ సాబ్’ స్పెషల్ షోకి తన భార్య తేజస్వినితో కలిసి వచ్చిన దిల్ రాజు.. సినిమా చూస్తూ థియేటర్లో రచ్చ చేశారు. తాను ఈ సినిమా ప్రొడ్యూసర్ని అనే విషయాన్ని కూడా మరచి పవర్ స్టార్ అంటూ అరుస్తూ పవన్ బొమ్మపై పేపర్లు విసిరారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దిల్ రాజును ఇలా చూసి షాక్ అవుతున్నారు జనం.మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులను పలకరించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించారు. చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించగా.. అంజలి, అనన్య నాగేళ్ల, నివేదా థామస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బాణీలు కట్టారు.
ఓవర్సీస్ సహా పలు ప్రదేశాల్లో ప్రదర్శించబడిన ఈ వకీల్ సాబ్ మూవీపై పాజిటివ్ టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్, వేణు శ్రీరామ్ టేకింగ్, థమన్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయని అంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతుందని పవన్ ఫ్యాన్స్ అంటున్న మాట.