గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన పూర్తిచేసుకొని వెనక్కి వచ్చిన ఇండియన్ క్రికెటర్ హనుమ విహారి, తెలంగాణ మంత్రి కే.టీ.ఆర్ని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమ విహారిని, టి.ఆర్.ఎస్ నేత కే.టీ.ఆర్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విహారి, తన బ్యాట్ను కేటీఆర్కు బహుమతిగా అందజేశారు. అనంతరం ఇరువురూ క్రికెట్ సంబంధిత అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఖచ్చితంగా ఓడిపోతామనుకున్న మూడో టెస్టులో, హనుమ విహారి వీరోచితంగా పోరాడి తన జట్టును గట్టెక్కించాడు. అశ్విన్ తో కలిసి విహారి సుమారు 50 ఓవర్లలు వికెట్ కోల్పోకుండా ఆడాడు. ఒకానొక దశలో 113 బంతులాడి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. గాయం కారణంగా విహారి పరిగెత్త లేక ఎక్కువశాతం డిఫెన్స్ మాత్రమే ఆడాడు.