గత రాత్రి కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన నైట్ పార్టీలో విజయ్ దేవరకొండ రచ్చ చేశారు. ఈ పార్టీకి విజయ్తో పాటు పలువురు బాలీవుడ్ బ్యూటీస్ అటెండ్ అయ్యారు.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీలతో ఎంజాయ్ చేశారు. వీకెండ్ పార్టీలో భాగంగా యంగ్ హీరోయిన్స్తో కలిసి రచ్చ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన నివాసంలో అరేంజ్ చేసిన పార్టీకి ఛార్మి, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సహా పలువరు బాలీవుడ్ బ్యూటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఛార్మి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
”మనీష్.. గత రాత్రి మా అందరికీ పార్టీ ఇచ్చినందుకు థాంక్స్. యూ ఆర్ స్వీట్ హార్ట్. వాట్ ఎ ఫన్ నైట్. అద్భుతమైన వ్యక్తులతో సరదాగా ఎంజాయ్ చేశాం. ఫుడ్ చాలా బాగుంది” అని ట్వట్టర్ ద్వారా వెల్లడించింది ఛార్మి. ఈ మేరకు అక్కడి పార్టీలో దిగిన పిక్స్ ఆమె షేర్ చేసింది. ఛార్మి పంచుకున్న ఈ ఫొటోల్లో పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్, సారా అలీఖాన్, కియారా అద్వానీ కనిపిస్తున్నారు. అందరూ ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉండటం గమనించవచ్చు. ఇంకా ఈ పార్టీకి బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరైంది.
Manish , thanks a ton for having us over last night.. u r a sweetheart ❤️ wat a fun night ❤️🤗 amazing food , amazing people 🤗@ManishMalhotra @karanjohar @SaraaliKKhan @TheDeverakonda @advani_kiara #purijagannadh #saturdaynight ❤️ pic.twitter.com/sx4BkcoGV4
— Charmme Kaur (@Charmmeofficial) February 21, 2021