పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండేపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు
When ART brings ARTISTS together , this is what it looks like 🤗💕❤️😍@TheDeverakonda @karanjohar #SaraAliKhan @ManishMalhotra #purijagannadh 🤩@PuriConnects #ADDAA #mumbai #PC pic.twitter.com/OOPG9xwYai
— Charmme Kaur (@Charmmeofficial) March 23, 2021
ఈ నేపథ్యంలో ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, చార్మీ, అనన్య పాండే పార్టీ చేసుకున్నారు. కరణ్ జొహార్, మనీశ్ మల్హోత్రా, సారా అలీ ఖాన్తో లైగర్ టీమ్ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
— Vijay Deverakonda Fans ™ (@ItsDeverakonda) March 22, 2021