ఫేస్బుక్ ఫ్లాట్ఫామ్ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ నిషేధ ఆజ్ఞలు 2023 జనవరి వరకు వర్తిస్తాయి. దీనిపై ట్రంప్ ఇవాళ స్పందించారు. ఇది అమెరికన్లను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ప్రజలు ఓటు వేసి తనను గెలిపించారని, ఎఫ్బీ తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు అవమానకరమని ట్రంప్ అన్నారు. ఎఫ్బీలో పోస్టులు పెట్టడం వల్ల క్యాపిటల్ హిల్ దాడి ఘటన జరిగిందని, ఆ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించారు. కొత్త నిషేధం వల్ల నవంబర్ 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ 2024లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల సమయానికి మళ్లీ ట్రంప్ ఎఫ్బీలో దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత ట్విట్టర్, యూట్యూబ్లు ట్రంప్ అకౌంట్లను పర్మినెంట్గా బ్యాన్ చేశాయి. 2020 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 7.5 కోట్ల మంది తనకు ఓటు వేశారని, తన ఎఫ్బీ అకౌంట్ను బ్యాన్ చేసి ఆ ఓటర్లను అవమానిస్తున్నారని, దీంట్లో విజయం సాధిస్తామని, ఇలాంటి అవమానాలను ఇక దేశం భరించలేదని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.