ప్రముఖ కథానాయకుడు సూర్య కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదు. అలాగని భయపడవద్దు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’’ అని సూర్య పేర్కొన్నారు.
హీరో సూర్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నిర్మాత బీఏ రాజు ట్వీట్ చేశారు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూర్యకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎయిర్డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
’கொரோனா’ பாதிப்பு ஏற்பட்டு, சிகிச்சை பெற்று நலமுடன் இருக்கிறேன். வாழ்க்கை இன்னும் இயல்பு நிலைக்கு திரும்பவில்லை என்பதை அனைவரும் உணர்வோம். அச்சத்துடன் முடங்கிவிட முடியாது. அதேநேரம் பாதுகாப்பும், கவனமும் அவசியம். அர்ப்பணிப்புடன் துணைநிற்கும் மருத்துவர்களுக்கு அன்பும், நன்றிகளும்.
— Suriya Sivakumar (@Suriya_offl) February 7, 2021