సూర్య, విక్రమ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ సినిమా తమిళనాట సంచలనం సృష్టించింది. తెలుగులో ‘శివ పుత్రుడు’ పేరుతో విడుదలై ఘన విజయం అందుకుంది. దాంతో కోలీవుడ్, టాలీవుడ్లో ఈ కాంబినేషన్కి మంచి క్రేజ్ ఏర్పడింది. సూర్య, విక్రమ్తో బాలా మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారా? అనే ఎదురుచూపులకు తెరపడింది. సూర్య- బాలా కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. సుమారు 18 ఏళ్ల తర్వాత మరో విభిన్న కథతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
என்னைவிட என் மீது அதிக நம்பிக்கை வைத்தவர்…
ஒரு புதிய உலகை எனக்கு அறிமுகம் செய்து அடையாளம் தந்தவர்..
20 ஆண்டுகளுக்கு பின் மீண்டும் அதே ஆர்வத்துடன் அவர் முன் நான்…
அப்பா ஆசீர்வதிக்க மீண்டும் ஓர் அழகிய பயணம் என் பாலா அண்ணனுடன்…
அனைவரின் அன்பும் ஆதரவும் தொடர வேண்டுகிறேன்… pic.twitter.com/H9wyutZD3h— Suriya Sivakumar (@Suriya_offl) October 28, 2021