కోవిడ్ బాధితులు కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొంతమంది సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు భారీ విరాళం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రముఖ సన్ టీవీ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కలయికతో కోవిడ్ రిలీజ్ ఫండ్ ను అందించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపగా ఒకవైపు మెచ్చుకోవడంతో పాటు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి.
టెలివిజన్ రంగంలో సన్ టీవీ ఛానెల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఆ ఛానెల్ నుంచి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఓనర్స్ గా ఉన్నటువంటి సన్ టీవీ కోవిడ్ బాధితుల కోసం 30కోట్ల రూపాయల విరాళాలాన్ని అందించింది.
అంతేకాకుండా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వెంటిలేటర్ బెడ్స్ వంటి సహాయలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటె నెటిజన్ల నుంచి వస్తున్న అభిప్రాయం విభిన్నంగా ఉంది. సన్ రైజర్స్ ఇటీవల ఐపీఎల్ లో చెత్త పెర్ఫామెన్స్ తో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో మిడిలార్డర్ ఆటగాళ్లను మొత్తం పీకేసి వాళ్ళ కోసం ఖర్చు చేసి ఆ డబ్బేదో కోవిడ్ బాధితులని ఇవ్వాలని అంటున్నారు.
ముఖ్యంగా సన్ రైజర్స్ టీమ్ బిల్డప్ ఎక్కువ ఆట తక్కువ అనే కామెంట్స్ అందుకున్న 3D ప్లేయర్ విజయ్ శంకర్ ను కూడా తీసేసి ఆ డబ్బును కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇక లీగ్ టేబుల్లో సన్ రైజర్స్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకొని ఆఖరి స్థానంలో నిలిచింది.