సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి వర్ధంతిని తిరువళ్లూరులోని బాలు ఘాట్ లో నిర్వహించారు బాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, సన్నిహితులు,బంధువుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలు మరణించి ఏడాది గడిచిపోయిందని, తండ్రిలేని లోటు ఎవ్వరికైనా పూడ్చలేనిదని అన్నారు బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఇప్పుడిప్పుడే షాక్ నుంచి అందరం కోలుకుంటున్నామని, ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకుంటున్నామని అన్నారు బాలు అభిమానులు పాటలు పాడి నివాళులర్పించారు.