సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలుగా మీడియాలో ఎక్కువగా నానుతూ వస్తుంది. చైతూతో విడాకులు తీసుకోనుందంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం హాలీడే మూడ్లో ఉంది. గోవా, తిరుపతి, చెన్నై ఇలా పలు ప్రాంతాలకు సోలోగా చక్కర్లు కొడుతుంది.
రీసెంట్గా సమంత తిరుపతిలో ప్రతక్ష్యం కాగా, తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు కారణంగా ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంపైపు ప్రయాణిస్తున్నారని కొందరు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రాములో పాపులర్ హీరోయిన్స్ త్రిష, కీర్తి సురేష్, కళ్యాణితో చిల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత సమంత డైరెక్ట్గా చెన్నైకి వెళ్లి తన ఫ్రెండ్స్ని కలిసినట్టు ఈ ఫొటోలని చూస్తుంటే అర్ధం అవుతుంది. సమంత నటించిన శాకుంతలం, కాతు వక్కుల రెండు కాదల్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చైతూతో కలిసి ఈ అమ్మడు వెబ్ సిరీస్ చేయనుందనే టాక్ ఒకటి నడుస్తుంది.