అందాల ముద్దుగుమ్మ సమంత 2017లో నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6-7 తేదీల్లో హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ అక్టోబర్ 2న చై-సామ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు. అన్ని పరిస్థితులు బాగుండి ఉంటే వారు నేడు యానివర్సరీ వేడుక జరుపుకొని ఉండేవారు.
ఈ రోజు నాగ చైతన్య- సమంత యానివర్సరీ కాగా, విడిపోయిన తర్వాత ఈ జంట వాటికి సంబంధించి ఏమైన జ్ఞపకాలను గుర్తు చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సమంత సింగిల్ ఫొటో షేర్ చేస్తూ భావోద్వేగపు పోస్ట్ పెట్టింది. పాత ప్రేమ పాటలు, పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. తెల్లని డ్రెస్ ధరించి నేలపై చూస్తూ ఒంటరిగా నడుస్తున్న ఫొటో షేర్ చేస్తూ సమంత పెట్టిన అందరికి కన్ఫ్యూజింగ్గా మారింది. ఏడాది క్రితం సమంత తమ పెళ్లి రోజు సందర్భంగా నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి.. ‘‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్’’ అని క్యాప్షన్తో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.