వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రిపబ్లిక్’. ఈ సినిమాను దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారట. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందింది. ఇక’రిపబ్లిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన వేళా త్వరలో సినిమా షూటింగ్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. అయితే షూటింగులు మొదలుపెట్టినంత త్వరగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. థియేటర్లకు జనం రావడానికి మరికొంత సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఇప్పటికే రెడీ అయిన సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. ఇలా ఓటీటీ వైపు చూస్తున్న సినిమాల్లో రిపబ్లిక్ కూడా ఉందని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 4న విడుదల అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని లేటెస్ట్ సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు కూడా నడుస్తున్నాయని అంటున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.