శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్కు జోడీగా శ్రీలీల నటించారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో బుధవారం ఈ సినిమా నుంచి ‘మధురా నగరిలో’ అంటూ సాగే పాటను నటుడు రవితేజ విడుదల చేశారు. శ్రీనిధి, నారాయణ నాయర్, కాళభైరవ ఈ పాటను ఆలపించారు.
శ్రీకాంత్-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో విడుదలైన సూపర్హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’కి సీక్వెల్గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై సందడి చేయనున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రావురమేశ్, ప్రకాశ్రాజ్, ఝాన్సీ, హేమ, తదితరులు కీలకపాత్రలు పోషించారు. రవాణి స్వరాలు అందించారు.