కన్నడ హాట బ్యూటీ రష్మిక మందన్నకు తెలుగులో మంచి పాపులారిటి ఉంది. అంతేకాదు ఈమె పాపులారిటీ బాలీవుడ్ సైతం పాకింది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఈ గురువారం ఈ సినిమా షూటింగ్లో రష్మిక మందన్న జాయిన్ అయింది. ఈ సినిమాతో బీ టౌన్లో కూడా సత్తా చూపెట్టాలని చూస్తోంది. దాంతో పాటు మరో సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్లో ఓ వీడియో ఆల్బమ్లో నటించింది. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్ను తెరకెక్కించారు. తాజాగా ఈ ఆల్బమ్కు సంబంధించిన టీజర్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ వీడియో ఆల్బమ్లో ఓ రేంజ్లో గ్లామర్ ఒలకబోసింది. తాజాగా ఈ వీడియో ఆల్బమ్కు సంబంధించిన పాటను విడుదల చేసారు.
ఈ పాటను ఉచానా అమిత్ బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో కొత్త అవతారంలో కేక పుట్టిస్తోంది. బాలీవుడ్లో ఫస్ట్ సినిమా విడుదల కాకముందే.. ఈ పాటతో రష్మిక హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రష్మిక విషయానికొస్తే.. ఈమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది రష్మిక మందన. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ తర్వాత నాగార్జున, నానిల ’దేవదాసు’లో నటించింది. ఇక గతేడాది సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నితిన్తో చేసిన ‘భీష్మ’ సినిమా కూడా సూపర్ హిట్టైంది. ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఈమె తెలుగుతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటిస్తోంది.
తన గ్లామర్తో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మిక మందనకు గూగుల్ మరపురాని గుర్తింపును ఇచ్చింది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైంది.ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే.. జాతీయ స్థాయిలో అంటే తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయలేదు. కానీ ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషాల్లో డబ్ చేశారు. ఇది కూడా ఆమె క్రేజ్ కారణం అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ ఘనతని దిశా పటానీ, ప్రియా ప్రకాష్ వారియర్, మానుషి చిల్లర్ సాధించారు. క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన ఈమె ఇపుడు కొత్త ఆల్బమ్తో ఎలాంటి సందడి చేయనుందో చూడాలి.