నీవల్లే వారిద్దరూ విడిపోయారని, సమంత కాపురంలో నిప్పులు పోశావని ఘాటు వ్యాఖ్యలతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. నెటిజన్లతో శక్తిమేర పోరాడిన ప్రీతమ్ జుకాల్కర్… ట్రోలింగ్ మరింత తీవ్రతరం కావడంతో చేసేది లేక సైబరాబాద్ పోలీసుల సాయం కోరాడు. తనపై ట్రోలింగ్ ను స్క్రీన్ షాట్ల రూపంలో పంచుకుని, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఈ ట్రోలింగ్ వల్ల మానసిక చిత్రవధ అనుభవిస్తున్నానని వాపోయాడు. అభిమానులు కూడా తనకు సహకరించాలని, తనను ట్రోల్ చేస్తున్న వారి ఖాతాలపై రిపోర్ట్ చేయాలని కోరాడు.