లేడి సూపర్ స్టార్ నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు.అది అలా ఉంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువుగా ఉన్నందునా నయనతార, విఘ్నేష్ శివన్ జంట తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఇటీవల రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మలైకా అరోరా, సల్మాన్ ఖాన్, కాజల్ వంటి సినీ సెలెబ్రిటీస్ వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.
నయనతార ప్రస్తుతం సమంతతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత వాయిదా పడింది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు.