హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో జరిగే దళిత బంధు సభ కుంభవృష్టి పడ్డ జరుగుతుందని, జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మంత్రి హరీశ్రావు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇప్పటికే గ్రామాలు, దళిత కాలనీల్లోకి బస్సులు చేరుకున్నాయని, మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.