మట్టి గణపతినే పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద బీసీ సంక్షేమ శాఖ, అలాగే 36వ వార్డు కౌన్సిలర్ ఉదర విజయ ఆధ్వర్యంలో మట్టి విగ్రహల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం మట్టి గణపతులను ప్రజలకు పంపిణి చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ప్రతిష్టించుకోని ఇంటిల్లిపాది వేడుకలు జరుపుకోవాలని అన్నారు.