మాజీ మంత్రి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హైదరాబాదులో కలిశారు. పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తన కుమారుడు వెంకట్రామ్ వివాహం త్వరలో జరగనుందని, పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలుగు భాష కథ, తెలుగు సంస్కృతి అనే పుస్తకాలను బహూకరించారు. పవన్ కల్యాణ్ పుస్తకాభిమాని అన్న సంగతి తెలిసిందే.