బాలీవుడ్ భామ కియారా అద్వానీ తెలుగులో నటించింది కేవలం రెండు సినిమాలే అయినా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టారు. భరత్ అనే నేను చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది కియారా.అరంగేట్రమే మహేష్ తో జతకట్టే ఛాన్స్ దక్కడం అంటే మాములు విషయం కాదు.
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సూపర్ హిట్ కాగా, కియారా అందం, అభినయానికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. రెండవ చిత్రంగా వినయ విధేయ రామ చిత్రంలో కియారా అద్వానీ నటించారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.
ఆ తరువాత కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయ్యారు. అక్కడ ఆమెకు వరుస ఆఫర్స్ నేపథ్యంలో టాలీవుడ్ ని అంతగా పట్టించుకోవడం లేదు.కేవలం స్టార్ హీరోల సినిమా అయితే తెలుగులో చేస్తారన్న మాట వినిపిస్తుంది.
ఎన్టీఆర్ తో కొరటాల ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కియారా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతుంది.దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్, కియారా కలిసి నటించలేదు, దీనితో ఈ కాంబినేషన్ సెట్ కావచ్చని టాక్.
తెలుగులో కియారా చేసిన రెండు పాత్రలు చాలా పద్దతిగా ఉంటాయి. అయితే హిందీ యాన్థాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ లో కియారా బోల్డ్ రోల్ చేశారు. లస్ట్ స్టోరీస్ లో అలాంటి రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.
తాజాగా పింక్ టూ పీస్ బికినీలో సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్న వీడియో విడుదల చేశారు కియారా. టూ పీస్ బికినీలో హాట్ హాట్ అందాలు ఆల్మోస్ట్ చూపించేసింది కియారా అద్వానీ. సమ్మర్ లో కియారా బికినీ ఫొటోలతో మరింత రచ్చ రేపగా వైరల్ అవుతున్నాయి.కియారా అర్థ నగ్న సౌందర్యం చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అటు సినిమాల పరంగా మొత్తంగా నాలుగు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.ఈ నాలుగు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఇక కియారా యువ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా సార్లు విహారాలు చేస్తూ వీరి కెమెరా కంటికి చిక్కారు.
My God.. #KiaraAdvani made my day 😇 pic.twitter.com/l1iXzBPl3h
— T w e e t B o y 🕊️ | Wear a Mask 😷 (@iamtweetboy) June 10, 2021