కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి ఇలాంటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ‘కర్నూలులో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవిమిది. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్లో నేను నటించడం, ఆయన పాత్రను నేను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని.. మెగాస్టార్ కథానాయకుడు ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడెక్షన్ పతాకంపై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిరు..‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.
Heartened & Overjoyed at the Hon'ble CM @ysjagan 's announcement naming #KurnoolAirport after the Firstever Freedom Fighter of India #UyyalavadaNarasimhaReddy Much deserved recognition to the greatest patriot & unsung Hero.Was fortunate & honored to play the great soul on screen
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2021