హైదరాబాద్: దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమీర్పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు రాళ్ల దాడిచేశారు. దీంతో ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం ప్రెస్ క్లబ్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.