సామాజిక మాధ్యమాల్లో తన మీద వస్తున్న వార్తలపై నటి అషూరెడ్డి ఘాటుగా స్పందించింది. తాను పవన్కల్యాణ్కు పెద్ద అభిమానినని, ఎప్పటికైనా అభిమానిగానే ఉంటానని స్పష్టం చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాసి తన పేరు చెడగొట్టవద్దని ఆమె కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తన సినిమాలో నటిస్తున్న నటీనటులను, టెక్నీషియన్లను పవన్కల్యాణ్ ఇటీవల సత్కరించి వాళ్లకు లేఖలు అందించారు. ఈ క్రమంలో అషూరెడ్డికి కూడా లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్తో అషూరెడ్డి ఒక ఫొటో దిగి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. పవన్కల్యాణ్ నా ఫస్ట్లవ్ అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతో ఆమెపై సోషల్మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వ్యాపించాయి. అయితే.. దీనిపై ఆమె తాజాగా స్పందించింది.
‘ఈ మధ్య సోషల్ మీడియాలో నాపై పిచ్చిరాతలు రాస్తున్నారు. నాకు పవన్కల్యాణ్గారు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అభిమానం అంటే ఎప్పటికైనా అభిమానమే.. దాన్ని వేరేలా ఆపాదిస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. సానుకూలతను పంచాల్సిన వాళ్లే చెడును విస్తరిస్తూ వేరేవాళ్ల పేరును బదనాం చేస్తూ రాయడం సరైంది కాదు. దీని వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వాటి వల్ల పవన్కల్యాణ్గారు తన అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి తీసుకెళుతున్నారు. నిజానికి ఇలాంటి వార్తలపై స్పందించకూడదు. కానీ.. నాకు ఓపిక నశించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరనుకున్నట్లు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక అభిమాని అంటే చచ్చేంతవరకూ అభిమానిలాగే ఉంటారు. అంతేగాని ఇంకేమీ ఉండదు. మీ రాతల వల్ల ఉన్న పేరును దయచేసి నాశనం చేయవద్దు’ అంటూ ఆమె పేర్కొంది.
గతంలో పెట్టిన పోస్టులో ఆమె ఏం రాసిందంటే.. ‘‘నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నన్ను, నా పచ్చబొట్టును ఇంకా గుర్తుంచుకున్నారు. నాకు టీ కూడా ఇచ్చారు. ఆయనతో రెండు గంటల పాటు సంభాషణ సాగింది. నాకు ఇదొక మధురమైన జ్ఞాపకం. బయలుదేరేటప్పుడు ఆయన నాకో లేఖ ఇచ్చాడు. ‘మీరు ఎల్లప్పుడూ నా ఫస్ట్.. లవ్ పవన్ కల్యాణ్’’ అంటూ ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో అక్కడి నుంచి అషూపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.