భారత ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు లభ్యమవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. గురువారం అంబానీ బంగ్లా సమీపంలో స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అంబానీ హత్య కుట్రకు ఈ కారును అక్కడ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి ముంబై పోలీసులు, ఎస్ఎస్జీ సెక్యూరిటీ చేరుకున్నారు. జాయింట్ కమిషనర్ విశ్వాస్ నాగ్రే పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పోలసులతో మాట్లాడారు. ముంబై పోలీసుల ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అనుమానస్పద కారు లభ్యమవడంతో.. పోలీసులు ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు.
ముఖేష్ అంబానీ యాంటిల్లా బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు లభ్యమవడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.